Crime news: విజయవాడలో చార్టెడ్‌ అకౌంటెంట్‌ సింధు అనుమానాస్పద మృతి

నగరంలోని గుణదల గంగిరెద్దులదిబ్బ వద్ద ఓ ఇంట్లో చార్టెడ్‌ అకౌంటెంట్‌ చెరుకూరి సింధు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తలకు బలమైన గాయం ఉండటంతో మాచవరం పోలీసులు కేసు నమోదు..

Published : 22 Aug 2021 01:02 IST

విజయవాడ: నగరంలోని గుణదల గంగిరెద్దులదిబ్బ వద్ద ఓ ఇంట్లో చార్టెడ్‌ అకౌంటెంట్‌ చెరుకూరి సింధు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తలకు బలమైన గాయం ఉండటంతో మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సింధుది హత్యేనని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆమె సన్నిహితుడు ప్రసేన్‌ ఈ హత్యచేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రసేన్‌తో సింధు సన్నిహితంగా ఉంటోందని, లాక్‌డౌన్‌ తర్వాత అతని ఇంట్లోనే ఉంటోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని యువతి తల్లిదండ్రులు విజయవాడ ఎంపీ కేశినేని నానిని కోరారు. పోలీసు కమిషనర్‌ను కలిసి ఈమేరకు ఫిర్యాదు చేయనున్నట్టు సింధు తల్లిదండ్రులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని