కాపలాపెడితే.. రూ.కోట్ల విలువైన భూమి కాజేసేందుకు యత్నం
భూ మాఫియా రెచ్చిపోతున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. తాజాగా.. బాలానగర్లో రూ.కోట్ల విలువ చేసే 1200 గజాల స్థలానికి
హైదరాబాద్: భూ మాఫియా రెచ్చిపోతున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. తాజాగా.. బాలానగర్లో రూ.కోట్ల విలువ చేసే 1200 గజాల స్థలానికి కాపలాదారుగా ఉంటూ ఆ భూమిపై నకిలీ పత్రాలు సృష్టించి యజమానినే బెదిరిస్తున్న వారిని బాలానగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఉపేంద్రనాథ్ అనే వ్యక్తి తన స్థలాన్ని కబ్జాదారుల నుంచి రక్షించుకునేందుకు పదేళ్ల క్రితం గడ్డం లక్ష్మి అనే మహిళను కాపలాదారుగా నియమించుకున్నారు. దాంతో లక్ష్మి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి అక్కడే నివాసముంటోంది. 2019లో యజమాని ఉపేంద్రనాథ్ భూమిని డెవలప్మెంట్కు ఇవ్వడంతో బిల్డర్ పనులు ప్రారంభించేందుకు యత్నించగా.. కాపలాదారు లక్ష్మి, ఆమె కుమార్తె సంధ్య వారిని అడ్డుకున్నారు. భూమి తమదే అంటూ నకిలీ పత్రాలు సృష్టించి పోలీసులను తప్పుదోవ పట్టించారు. రూ.20లక్షలు లేదా 100 గజాల స్థలం ఇవ్వాలని యజమానిని బెదిరింపులకు గరిచేశారు. యజమాని ఉపేంద్రనాథ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అందుకు ప్రతిగా.. పోలీసులు, కబ్జాదారులు తమను వేధిస్తున్నారంటూ కాపలాదారు లక్ష్మి, సంధ్య మానవహక్కుల కమిషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కబ్జాదారులు తమపై దాడి చేశారంటూ మరోసారి లక్ష్మి, సంధ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల కేసులను పరిశీలించిన అనంతరం మోసాలకు పాల్పడుతున్న కాపలాదారుగా ఉంటున్న మహిళలు లక్ష్మి, సంధ్య, సరిత, వారికి సహకరించిన ఆర్మీ ఉద్యోగి దిలీప్కుమార్ను బాలానగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రధాన నిందితుడు శ్రీనివాస్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా