Crime News: ఎక్సైజ్‌ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పోలీసుస్టేషన్‌ పరిధిలోని జిల్లా ఎక్సైజ్‌ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ..

Published : 05 Sep 2021 19:45 IST

హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పోలీసుస్టేషన్‌ పరిధిలోని జిల్లా ఎక్సైజ్‌ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. చేవెళ్ల ఎక్సైజ్ కార్యాలయంలో పనిచేసే ఆశయ్య అనే కానిస్టేబుల్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులా?  మరో కారణమా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆశయ్య స్వస్థలం వికారాబాద్‌ జిల్లా ఎన్నికతల గ్రామం. నిన్న ఉదయం 10గంటలకు శంషాబాద్‌ ఎక్సైజ్‌ కార్యాలయానికి ఆశయ్య విధులకు వచ్చారు. ఇవాళ రిలీవర్‌ గణేష్ వచ్చి చూడగా ఫ్యానుకు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో వారు శంషాబాద్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో ఉన్న ఆధారాలను సేకరించి.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని