AP News: దీపం వదులుతూ కాల్వలో పడిన దంపతుల మృతి
కార్తిక మాస దీప కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. కర్నూలులోని కేసీ కాలువలో ప్రమాదవశాత్తు పడిన దంపతులు మృతి చెందారు. కర్నూలులోని అబ్బాస్ నగర్లో
కర్నూలు నేరవిభాగం, న్యూస్టుడే: కార్తిక మాస దీప కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. కర్నూలులోని కేసీ కాలువలో ప్రమాదవశాత్తు పడిన దంపతులు మృతి చెందారు. కర్నూలులోని అబ్బాస్ నగర్లో నివాసం ఉండే రాఘవేంద్రప్రసాద్(44) టీజీవీ గ్రూప్ సంస్థలో పని చేస్తుండేవారు. ఆయనకు భార్య ఇందిర(41), ఇద్దరు కుమారులు. కార్తిక పౌర్ణమి కావడంతో రాఘవేంద్ర ప్రసాద్ దంపతులు శుక్రవారం ఉదయం 5 గంటలకు వినాయక్ ఘాట్ వద్ద కేసీ కాల్వ పక్కనే ఉన్న గుడికి వెళ్లారు. ఇందిర కాలువలో దీపం వదులుతూ అదుపుతప్పి అందులో పడిపోయారు. ఆమెను కాపాడేందుకు వెళ్లి రాఘవేంద్రప్రసాద్ కూడా కాల్వలో పడిపోయారు. స్థానికులు గమనించి వీరిని కాపాడేందుకు ప్రయత్నించగా.. ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో ఇద్దరూ అప్పటికే కొట్టుకుపోయారు. ఈ లోపు సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి విస్తృతంగా గాలింపు చేపట్టారు. చివరికి ఘటన స్థలి నుంచి సుమారు 4 కి.మీ దూరంలోని జొహరాపురం వద్ద ఆ దంపతుల మృతదేహాలను గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
-
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
AP News: అమ్మో.. అన్ని రోజులా?ఖర్చుల భారంపై నేతల తర్జనభర్జన..!
-
Gadchiroli: గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టుల హతం
-
మూడు కార్లలో తాయిలాల సరకు దాటిపోయిందా...?!
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు