Couple Suicide: కుటుంబ కలహాలతో ఉరేసుకొని దంపతుల బలవన్మరణం 

కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది.

Published : 07 Sep 2021 01:18 IST

మిరుదొడ్డి: కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది. దుబ్బాక సీఐ హరికృష్ణ గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దేవరాజు(30), మమత దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి మోక్షవర్ధన్‌, మనస్విత్‌ అనే ఇద్దరు కుమారులున్నారు. దంపతుల మధ్య ఆరు నెలల కిందట మనస్పర్థలు వచ్చి తరచూ గొడవ పడేవారు. ఇదిలా ఉండగా, దేవరాజు కుటుంబం, అతని తల్లిదండ్రులు రాములు, దేవవ్వతో కలిసి వన భోజనాల కోసం మోతె గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లారు.

కార్యక్రమం అనంతరం రాత్రి సమయంలో పిల్లల్ని, తల్లిదండ్రులను అక్కడే వదిలేసి దేవరాజు దంపతులు స్వగ్రామానికి వచ్చారు. ఇంటికి వచ్చిన అనంతరం భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన దంపతులిద్దరూ ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని