Cyber Crime: లింక్లు పంపి.. రూ.37 లక్షలు లాగేశారు
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ప్రయత్నంలో ఓ వ్యాపారి రూ.21 లక్షలు మోసపోయారు. మంగళవారం హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై వెంకటాద్రి కథనం ప్రకారం.
నారాయణగూడ, న్యూస్టుడే: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ప్రయత్నంలో ఓ వ్యాపారి రూ.21 లక్షలు మోసపోయారు. మంగళవారం హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై వెంకటాద్రి కథనం ప్రకారం.. ముషీరాబాద్లోని ఆజామాబాద్కు చెందిన వ్యాపారి వాట్సాప్కు ఎస్క్యూ.కామ్ అనే యాప్కు సంబంధించిన లింక్ వచ్చింది. క్లిక్ చేసి చూడగా.. పెట్టే పెట్టుబడికి రెండు, మూడింతలు లాభాలు వచ్చేలా చేస్తామని ఉంది. మొదటి ప్రయత్నంగా రూ.2 వేలు పెట్టగా, సాయంత్రానికి రూ.4 వేలు వచ్చాయి. తర్వాత రూ.లక్ష పెడితే, రూ.2.62 లక్షలు అయ్యాయి. ఆన్లైన్ మార్కెట్ లాభాల బాటలో దూసుకుపోతోంది. మరింత పెట్టుబడి పెట్టండని చెప్పడంతో వ్యాపారి విడతల వారీగా రూ.21 లక్షలు పెట్టగా, దానికి రూ.50 లక్షలు లాభం వచ్చినట్లు యాప్లో కనిపిస్తోంది. కానీ విత్డ్రా ఆప్షన్ కనిపించలేదు. అవతలి వ్యక్తి అందుబాటులోలేకుండా పోయాడు. తర్వాత యాప్ కూడా మాయమైంది. ఇదే తరహాలో యూసుఫ్గూడ, బండ్లగూడకు చెందిన ఇద్దరు మహిళలతో ఈబే యాప్, ఎంజెడ్హెచ్ ఇన్వెస్ట్మెంట్ యాప్లో పెట్టుబడులు పెట్టించి రూ.8 లక్షల చొప్పున కాజేశారు సైబర్ కేటుగాళ్లు. బాధితులు సైబర్ పోలీసులను ఆశ్రయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతిచెందారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగుప్ప 81వ బెటాలియన్లో చోటు చేసుకుంది. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM