UP: దళిత బాలికను బంధించి.. కాళ్లపై కొడుతూ..
ఉత్తరప్రదేశ్లోని అమేఠీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దొంగతనం అభాండాన్ని మోపుతూ ఓ దళిత బాలికను ఓ కుటుంబం చిత్రహింసలు పెట్టింది......
లఖ్నవూ: ఉత్తరప్రదేశ్లోని అమేఠీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దొంగతనం అభాండాన్ని మోపుతూ ఓ దళిత బాలికను ఓ కుటుంబం చిత్రహింసలు పెట్టింది. ఆ అభాగ్యురాలిపై ఇష్టారీతిన దాడి చేశారు. దొంగతనం ఎందుకు చేశావంటూ.. బాలికను ఇంట్లో కింద పడుకోబెట్టి కాళ్లను ఓ కర్రపై పెట్టి మరో కర్రతో కొడుతూ అత్యంత కఠినంగా వ్యవహరించిన ఓ వీడియో షాక్కు గురిచేస్తోంది. నొప్పితో బాలిక విలవిల్లాడుతూ రోదిస్తున్నా ఎలాంటి కనికరం చూపలేదు. అక్కడే ఉన్న కొందరు మహిళలు కూడా నిందితులకు వంతుపాడటం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ ఘటనపై అమేఠీ ఎంపీ, మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దళిత బాలికపై జరిగిన దాడిని కాంగ్రెస్ ప్రధాన నేత ప్రియాంకా గాంధీ తీవ్రంగా ఖండించారు. ఈ వీడియోను ట్వీట్ చేస్తూ.. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రతిరోజు 34 కులపరమైన నేరాలు, మహిళలపై 135 నేరాలు నమోదవుతున్నప్పటికీ.. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలోని పోలీసు యంత్రాంగం నిద్రపోతోందని మండిపడ్డారు. ఈ కేసులోని బాధ్యులను 24 గంటల్లో అరెస్టు చేయకుంటే ఆందోళనకు దిగుతామని యూపీ ప్రభుత్వాన్ని ఆమె హెచ్చరించారు.
అమేఠీ పోలీసులు ఈ ఘటనపై స్పందించారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ అర్పిత్ కపూర్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. పోక్సో చట్టం, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద పలువురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుల్లో ఒకరైన నమన్ సోని అనే వ్యక్తిని అరెస్టు చేశామని, మిగతా వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో 22న పదోతరగతి ఫలితాలు
-
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
-
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
-
‘నా తమ్ముడికి ఓట్లేస్తే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
-
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు