Disha Encounter: దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకం: మృతుల కుటుంబ సభ్యుల వాంగ్మూలం
దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకమని మృతుల కుటుంబ సభ్యులు సిర్పూర్కర్ కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. తమ కుమారులు పారిపోలేదని, పోలీసులే పట్టుకెళ్లి
హైదరాబాద్: దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకమని మృతుల కుటుంబ సభ్యులు సిర్పూర్కర్ కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. తమ కుమారులు పారిపోలేదని, పోలీసులే పట్టుకెళ్లి కాల్చి చంపారని కమిషన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సిర్పూర్కర్ కమిషన్ విచారణలో భాగంగా .. మృతుల కుటుంబ సభ్యులు ఈరోజు కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. బాధితుల వాంగ్మూలాన్ని కమిషన్ నమోదు చేసుకుంది. రేపు కూడా మృతుల కుటుంబ సభ్యుల నుంచి కమిషన్ సాక్ష్యం సేకరించనుంది.
2019 నవంబరు 27న ఓ యువ వైద్యురాలిని నలుగురు యువకులు తొండుపల్లి టోల్గేట్ సమీపంలో హత్యాచారం చేశారు. ఆ తర్వాత షాద్నగర్ సమీపంలో జాతీయ రహదారి వంతెన కింద పెట్రోల్ పోసి తగులబెట్టారు. కేసు నమోదు చేసుకున్న షాద్నగర్ పోలీసులు ఆరిఫ్, చెన్నకేశవులు, నవీన్, శివలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దర్యాప్తులో భాగంగా కస్టడీలోకి తీసుకున్న షాద్నగర్ పోలీసులు 2019 డిసెంబరు 6న ఘటనాస్థలికి నిందితులను తీసుకెళ్లారు. నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పాటు, పోలీసుల వద్ద ఉన్న రెండు తుపాకులు లాక్కొని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు నిందితులు చనిపోయారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో మానవ హక్కుల సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఎన్ కౌంటర్ పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు 2019 డిసెంబర్ 12న సిర్పూర్కర్ కమిషన్ ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిర్పూర్కర్ కమిషన్ ఎన్ కౌంటర్ పై ఆరు నెలల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్