
Published : 08 Dec 2021 08:10 IST
AP News: తాడేపల్లిలో ఇంజినీరింగ్ విద్యార్థుల మొబైల్ ఫోన్లు చోరీ
తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద బ్యాగ్లో ఉంచిన 24 మొబైల్ ఫోన్లు చోరీకి గురయ్యాయి. వట్టిచెరుకుఊరు కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు కృష్ణానదిలో స్నానానికి వెళుతూ ఒడ్డున బ్యాగ్లో 24 సెల్ఫోన్లు ఉంచారు. స్నానం తర్వాత ఒడ్డుకు చేరుకుని చూసేసరికి ఆ బ్యాగ్ కనిపించలేదు. అనంతరం విద్యార్థులు తాడేపల్లి పోలీసులను ఆశ్రయించారు. సుమారు రూ.3లక్షల విలువైన సెల్ఫోన్లు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కృష్ణా కరకట్ట వెంబడి ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
Tags :