Fake case: డ్రగ్స్ కేసు భయంతో.. యువ నటి ఆత్మహత్య
మహారాష్ట్రలో విస్తుపోయే ఘటన వెలుగు చూసింది. నకిలీ అధికారుల వేధింపులు ఓ యువ నటి ఆత్మహత్యకు పాల్పడేలా చేశాయి......
ముంబయి: మహారాష్ట్రలో విస్తుపోయే ఘటన వెలుగు చూసింది. నకిలీ అధికారుల వేధింపులు ఓ యువ నటి ఆత్మహత్యకు పాల్పడేలా చేశాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులమంటూ ఇద్దరు దుండగులు భయభ్రాంతులకు గురిచేయడంతో సదరు నటి అర్ధాంతరంగా తనువు చాలించింది. ఈ బెదిరింపులకు పాల్పడిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ముంబయికి చెందిన ఓ యువ నటి (28) డిసెంబరు 20న ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ ఫైవ్స్టార్ హోటల్లో పార్టీకి వెళ్లింది. అయితే అక్కడకు చేరుకున్న ఇద్దరు వ్యక్తులు తాము ఎన్సీబీ అధికారులమంటూ.. డ్రగ్స్ కేసులో పేరు వెల్లడించకుండా ఉండాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని ఆమెను డిమాండ్ చేశారు. అప్పటినుంచి డబ్బుల కోసం ఆమెకు పదేపదే ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో మనస్థాపానికి గురైన నటి.. తన గదిలోని ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం నిందితులు సూరజ్ మోహన్ పరదేశి(38), పర్వీన్ రఘునాథ్ వాలింబే(35)ను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
నటి ఆత్మహత్య నేపథ్యంలో ఎన్సీబీపై మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నవాబ్ మాలిక్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఎన్సీబీనే తమ ప్రైవేట్ ఆర్మీతో డబ్బుల కోసం మహిళను వేధించిందని ఆరోపించారు. ‘బాలీవుడ్ నటీమణుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ఎన్సీబీనే ఓ ప్రైవేట్ ఆర్మీని ఏర్పాటు చేసింది. నకిలీ కేసుల పేరుతో వారిని బెదిరించి, డబ్బులను గుంజుతోంది. ఎన్సీబీ ప్రైవేట్ ఆర్మీ వేధింపులు తట్టుకోలేకే సదరు నటి బలవన్మరణానికి పాల్పడింది’ అని మాలిక్ ఆరోపించారు. అయితే నిందితులతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎన్సీబీ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా