Fake Currency: రూ.2వేల నోట్లు రద్దవుతున్నాయంటూ స్థిరాస్తి వ్యాపారికి టోకరా!
నకిలీ నోట్లతో మోసాలకు పాల్పడుతున్న ముఠా రాచకొండ కమిషనరేట్ పోలీసులకు చిక్కింది. నల్లధనాన్ని మార్చుకునేందకు కొందరు ధనికులు 500 రూపాయల నోట్లను తీసుకొని..
హైదరాబాద్: నకిలీ నోట్లతో మోసాలకు పాల్పడుతున్న ముఠా రాచకొండ కమిషనరేట్ పోలీసులకు చిక్కింది. నల్లధనాన్ని మార్చుకునేందుకు కొందరు ధనికులు 500 రూపాయల నోట్లను తీసుకొని 2వేల రూపాయలు ఇస్తున్నారంటూ ఈ ముఠా మోసాలకు పాల్పడింది. ఈ విషయాలను రాచకొండ సీపీ మహేష్ భగవత్ మీడియాకు వెల్లడించారు. బహిరంగ మార్కెట్లో త్వరలో 2వేల రూపాయల నోట్లను రద్దు చేస్తున్నారని, వాటిని అతి తక్కువ ధరకు దక్కించుకోవచ్చని ఈ ముఠా నమ్మించింది. సినిమాలో చిత్రీకరణ కోసం ఉపయోగించే డమ్మీ 2వేల రూపాయల నోట్లను చూపించి కరీంనగర్కు చెందిన ఐదుగురు సభ్యుల ముఠా మోసాలకు పాల్పడింది. నిందితులను అరెస్టు చేసి కోటి రూపాయల నకిలీ 2వేల నోట్లను, ఓ వాహనాన్ని కీసర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే భాగ్యలక్ష్మికి అజీజ్ అనే పాత నేరస్థుడితో పాటు, అన్వర్, సుభాష్, నాగరాజుతో పరిచయం ఏర్పడింది.
డబ్బుల కోసం మోసాలకు పాల్పడేందుకు ఈ ముఠా నిర్ణయించుకుంది. రాజిరెడ్డి అనే స్థిరాస్తి వ్యాపారిని ముందుగా భాగ్యలక్ష్మి పరిచయం చేసుకుంది. కోటీశ్వరులు నల్లధనాన్ని అతి తక్కువ నగదుకే ఇస్తున్నట్లు అతన్ని నమ్మించింది. 2వేల రూపాయల నోట్లు రద్దవుతున్నాయని.. ధనికులంతా 500, 200 రూపాయల నోట్లు తీసుకొని 2వేల రూపాయల నోట్లు ఇస్తున్నట్టు చెప్పింది. నల్లధనం తీసుకోవడానికి రాజిరెడ్డి తన వద్ద ఉన్న రూ.5 లక్షలు తీసుకొని శామీర్పేటలోని ఓ ఫామ్ హౌజ్ వద్దకు చేరుకున్నాడు. అప్పటికే అన్వర్, అతని ముఠా సభ్యులు అక్కడ మాటు వేశారు. ముఠాలోని ఓ సభ్యుడు పోలీసు దుస్తులు వేసుకొని రాజిరెడ్డిని బెదిరించాడు. నల్లధనం దందా చేస్తున్నావా? అని బెదిరించి అతని వద్ద ఉన్న సొమ్మును తీసుకొని ఉడాయించాడు. వారం తర్వాత రాజిరెడ్డి తనకు జరిగిన మోసాన్ని కీసర పోలీసులకు తెలియజేయడంతో నకిలీ నోట్ల దందా బయటపడింది. సీసీ కెమెరాల దృశ్యాలు, సెల్ ఫోన్ నెంబర్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు. ఈ ముఠా ఇంకా ఎక్కడెక్కడ మోసాలకు పాల్పడిందనే విషయాలపై కీసర పోలీసులు ఆరా తీస్తున్నారు.
నకిలీ నోట్లు ఎలా వచ్చాయంటే..
ముఠా సభ్యుల్లో సుభాష్ సినీరంగంలో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. సనత్ నగర్కు చెందిన ఇతనికి గతంలోనే ఆజామ్, అన్వర్లతో పరిచయం ఉంది. అన్వర్ కూడా లఘు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తుంటాడు. మోసాలకు పాల్పడాలని నిర్ణయించుకున్న ముఠా సభ్యులు.... సుభాష్ ద్వారా ఓ ఆర్ట్ డైరెక్టర్ను కృష్ణానగర్లో సంప్రదించారు. ఆజమ్ను దర్శకుడిగా పరిచయం చేసుకున్నాడు. ఓ లఘు చిత్రం తీయడానికి నకిలీ 2వేల నోట్లు కావాలని సుభాష్ ఆర్ట్ డైరెక్టర్ను కోరాడు. అన్వర్ పోలీస్ పాత్ర పోషిస్తున్నాడని అతనికి డ్రామా డ్రెస్ కంపెనీలో పోలీసు దుస్తులు ఇప్పించాలని కోరాడు. నిజమని నమ్మిన ఆర్ట్ డైరెక్టర్.. కృష్ణానగర్లోని ప్రింటింగ్ ప్రెస్లో నకిలీ నోట్లతో పాటు పోలీసు డ్రెస్ను సుభాష్కు సమకూర్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
ముంబయిలో రూ.6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురు వ్యక్తుల నుంచి 3 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షలో జవాబు పత్రం చూపించలేదని ఘోరం
పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
అయిదేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడి అరెస్టు
దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.