AP News: గ్రానైట్‌ లారీ క్యాబిన్‌లో మంటలు.. అప్రమత్తమై ప్రాణాలు కాపాడుకున్న డ్రైవర్‌

గ్రానైట్‌ రాళ్లను తీసుకెళ్తున్న లారీ మార్గంమధ్యలో మంటల్లో కాలిపోయిన ఉదంతం చీమకుర్తి బైపాస్‌ రహదారిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చీమకుర్తి ప్రాంతంలోని గ్రానైట్‌ క్వారీ నుంచి ట్రాలీ లారీ రాళ్లతో కృష్ణపట్నం పోర్టుకు వెళ్తోంది. చీమకుర్తి బైపాస్‌ రహదారిలో

Updated : 24 Nov 2021 07:26 IST


బైపాస్‌ రహదారిపై మంటల్లో కాలిపోతున్న లారీ

చీమకుర్తి, న్యూస్‌టుడే: గ్రానైట్‌ రాళ్లను తీసుకెళ్తున్న లారీ మార్గంమధ్యలో మంటల్లో కాలిపోయిన ఉదంతం చీమకుర్తి బైపాస్‌ రహదారిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చీమకుర్తి ప్రాంతంలోని గ్రానైట్‌ క్వారీ నుంచి ట్రాలీ లారీ రాళ్లతో కృష్ణపట్నం పోర్టుకు వెళ్తోంది. చీమకుర్తి బైపాస్‌ రహదారిలో కె.వి.పాలెం కూడలి దాటిన తర్వాత లారీ క్యాబిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్‌ కిందికి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ప్రమాదంలో క్యాబిన్, ఆయిల్‌ ట్యాంక్, టైర్లు కాలిపోయాయి. మంటల తీవ్రతకు అవి పెద్ద శబ్దంతో పేలి పోయాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక యంత్రం సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. సుమారు అరగంటపాటు లారీ నుంచి మంటలు వస్తుండటంతో రహదారికి ఇరువైపులా భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఎస్సై పి.నాగశివారెడ్డి ఆధ్వర్యంలో రాకపోకలను క్రమబద్ధీకరించారు. లారీ నిప్పట్లపాడుకి చెందిన వెంకటేశ్వరరావుదిగా తెలిసింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని