AP News: గ్రానైట్ లారీ క్యాబిన్లో మంటలు.. అప్రమత్తమై ప్రాణాలు కాపాడుకున్న డ్రైవర్
గ్రానైట్ రాళ్లను తీసుకెళ్తున్న లారీ మార్గంమధ్యలో మంటల్లో కాలిపోయిన ఉదంతం చీమకుర్తి బైపాస్ రహదారిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చీమకుర్తి ప్రాంతంలోని గ్రానైట్ క్వారీ నుంచి ట్రాలీ లారీ రాళ్లతో కృష్ణపట్నం పోర్టుకు వెళ్తోంది. చీమకుర్తి బైపాస్ రహదారిలో
బైపాస్ రహదారిపై మంటల్లో కాలిపోతున్న లారీ
చీమకుర్తి, న్యూస్టుడే: గ్రానైట్ రాళ్లను తీసుకెళ్తున్న లారీ మార్గంమధ్యలో మంటల్లో కాలిపోయిన ఉదంతం చీమకుర్తి బైపాస్ రహదారిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చీమకుర్తి ప్రాంతంలోని గ్రానైట్ క్వారీ నుంచి ట్రాలీ లారీ రాళ్లతో కృష్ణపట్నం పోర్టుకు వెళ్తోంది. చీమకుర్తి బైపాస్ రహదారిలో కె.వి.పాలెం కూడలి దాటిన తర్వాత లారీ క్యాబిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ కిందికి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ప్రమాదంలో క్యాబిన్, ఆయిల్ ట్యాంక్, టైర్లు కాలిపోయాయి. మంటల తీవ్రతకు అవి పెద్ద శబ్దంతో పేలి పోయాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక యంత్రం సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. సుమారు అరగంటపాటు లారీ నుంచి మంటలు వస్తుండటంతో రహదారికి ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎస్సై పి.నాగశివారెడ్డి ఆధ్వర్యంలో రాకపోకలను క్రమబద్ధీకరించారు. లారీ నిప్పట్లపాడుకి చెందిన వెంకటేశ్వరరావుదిగా తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
-
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి