Fire Accident: కృష్ణా జిల్లా.. ప్లాస్టిక్‌ కంపెనీలో అగ్నిప్రమాదం

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలో అగ్ని ప్రమాదం జరిగింది.

Updated : 03 Sep 2021 12:50 IST

గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెం పారిశ్రామికవాడ సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. తెంపల్లి శివారులోని శ్రీవిద్య పాలిమర్స్‌ ప్లాస్టిక్‌ కర్మాగారంలో శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. విద్యుదాఘాతంలో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న గన్నవరం అగ్నిమాపక సిబ్బంది, ఆత్కూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు కమ్మేశాయి. విపరీతంగా పొగలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో అందులో కార్మికులెవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనలో రూ.కోట్లలో నష్టం వాటిల్లినట్లు పోలీసులు, యాజమాన్యం అంచనా వేస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని