Encounter: ఎన్‌కౌంటర్‌.. ఆరుగురు మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో పోలీసులు, 

Updated : 27 Dec 2021 15:40 IST

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లాలో తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్‌, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. చర్లకు మండలానికి 25 కి.మీ దూరంలోని కుర్ణవల్లి, పెసలపాడు అటవీప్రాంతంలో ఈ ఉదయం 6 నుంచి 7.30గంటల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. మృతిచెందిన ఆరుగురిలో నలుగురు మహిళా మావోయిస్టులున్నారు. ఎదురుకాల్పుల్లో చర్ల ఏరియా మిలీషియా కమాండర్‌ మధు మృతిచెందినట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని