AP News: ఏపీలో ఫిక్స్డ్ డిపాజిట్ల స్కామ్.. సూత్రధారులెవరు? పాత్రధారులెవరు?
హైదరాబాద్లో తెలుగు అకాడమీకి చెందిన ఫిక్స్డ్ డిపాజిట్ల నిధుల దుర్వినియోగం, మళ్లింపు కేసు దర్యాప్తు మరిన్ని కుంభకోణాల డొంకను కదిలిస్తోంది. విజయవాడలోని రెండు
విజయవాడ: హైదరాబాద్లో తెలుగు అకాడమీకి చెందిన ఫిక్స్డ్ డిపాజిట్ల నిధుల దుర్వినియోగం, మళ్లింపు కేసు దర్యాప్తు మరిన్ని కుంభకోణాల డొంకను కదిలిస్తోంది. విజయవాడలోని రెండు కార్పొరేషన్ల పరిధిలో సుమారు రూ.14.60 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు మాయమైనట్టు ఆయా సంస్థల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ సంస్థ పరిధిలో మాయమైన మొత్తాన్ని నిధులు డిపాజిట్ చేసిన బ్యాంకు తిరిగి వెంటనే చెల్లించడం చర్చనీయాంశమైంది. నిధులు మాయం కావడం? మళ్లీ డిపాజిట్ చేయడం వెనుక సూత్రధారులు, పాత్రదారులు ఎవరనేది త్వరలోనే నిగ్గు తేలుస్తామని పోలీసు ఉన్నాతాధికారులు చెబుతున్నారు. విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన రెండు కేసుల్లో ఒకే తరహా మోసాలు జరగడంతో సమగ్ర దర్యాప్తు కోసం తూర్పు మండల డీసీపీ హర్షవర్దన్రాజు పర్యవేక్షణలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్కు దర్యాప్తు బాధ్యతను అప్పగించినట్టు విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు.
విజయవాడలోని ఆత్కూరు పోలీస్స్టేషన్ పరిధి వీరపనేనిగూడెంలో ఉన్న సప్తగిరి గ్రామీణ బ్యాంకులో ఏపీ కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ లిమిటెడ్కు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్లు దుర్వినియోగం, దారిమళ్లింపు పట్ల సంస్థ మేనేజరు చలపాక రమణమూర్తి ఈనెల 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో రూ.5కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను నకిలీపత్రాలు సృష్టించి, ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ ఉద్యోగుల సంతకాలు ఫోర్జరీ చేసి వేర్వేరు బ్యాంకు ఖాతాలకు మళ్లించి దుర్వినియోగం చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఏడాది మేలో ఈ కుంభకోణం జరిగినట్టు అనుమానిస్తున్నారు. సంస్థకు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్ల లావాదేవీలపై సమగ్ర దర్యాప్తును పోలీసులు కొనసాగిస్తున్నామన్నారు. ఇదే సమయంలో ఏపీ స్టేట్ వేర్హౌస్ కార్పొరేషన్కు చెందిన రూ.9.60కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను భవానీపురం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉంచారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఉద్యోగుల సంతకాలు, నకిలీ ధ్రువపత్రాలతో కరెండ్ అకౌంట్ తెరిచి దాన్నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లను వివిధ బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి దుర్వియోగం చేసినట్టు ఆ సంస్థ మేనేజరు యర్రాప్రగడ పట్టాభిరామయ్య ఈనెల 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు. భవానీపురం పోలీసులు దీనిపై కేసు నమోదు చేసినట్టు విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. ఈ రెండు కేసులను సీసీఎస్ ద్వారా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయిస్తున్నట్లు చెప్పారు.
ఈ రెండు కేసుల దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ సీసీఎస్ పోలీసులతోనూ చర్చిస్తున్నారు. తెలుగు అకాడమీకి చెందిన ఫిక్స్డ్ డిపాజిట్ల నిధుల దుర్వినియోగం, వాటి మళ్లింపు కేసులో అరెస్టు అయిన నిందితుల ప్రమేయం ఈ రెండు కేసుల్లోనూ ఉందని ప్రాథమికంగా పోలీసులు నిర్థారణకు వచ్చారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చెందిన రూ.9.60 కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్ మొత్తాన్ని ఐవోబీ బ్యాంకు తిరిగి సంస్థ ఖాతాలో జమ చేసింది. వడ్డీ మొత్తం కూడా ఇస్తామని బ్యాంకు ఉన్నతాధికారులు వేర్హౌస్ కార్పొరేషన్కు సమాచారం అందించారు. ఈ కుంభకోణం ఎవరి సహకారంతో జరిగింది? డబ్బులు బయటకు వెళ్లడం.. మళ్లీ వెనక్కి రావడంలో కీలకంగా వ్యవహరించింది ఎవరనేది దర్యాప్తులో నిగ్గు తేలుస్తామని సీపీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్