Crime news: మాజీ మిస్ తెలంగాణ.. మరోసారి ఆత్మహత్యాయత్నం
జీవితంపై విరక్తితో హైదరాబాద్లో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించిన మోడల్ మరోసారి కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని కీసర బ్రిడ్జి పైనుంచి మున్నేరులో ..
నందిగామ: జీవితంపై విరక్తితో హైదరాబాద్లో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించిన మోడల్ మరోసారి కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని కీసర బ్రిడ్జి పైనుంచి మున్నేరులో దూకి ఆత్మహత్యకు యత్నించింది. స్థానికులు ఆమెను గుర్తించి వెంటనే మున్నేరు నీటిలో ఉన్న ఆమెను కాపాడి నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం బుధవాడ గ్రామానికి చెందిన కలక భవాని అలియాస్ హాసిని(21) హైదరాబాద్ హిమాయత్నగర్లోని ఓ అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటోంది. ఓ ప్రైవేటు సంస్థ 2018లో నిర్వహించిన పోటీలో ‘మిస్ తెలంగాణ’గా ఎంపికయ్యారు. హిమాయత్నగర్లోని ఒక అపార్టుమెంట్లో ఒంటరిగా ఉంటూ మోడలింగ్ చేస్తున్నారు. బుధవారం రాత్రి 10:30 గంటల సమయంలో చున్నీతో ఫ్యాన్కు ఉరి బిగించుకొని తన తల్లిదండ్రులు, స్నేహితులకు ఇన్స్టాగ్రామ్లో వీడియో కాల్ (కాన్ఫరెన్స్) చేశారు. కంగారుపడిన తల్లిదండ్రులు, స్నేహితులు ఫోన్లు చేస్తున్నా పట్టించుకోకుండా ఆమె తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెబుతూనే ఉన్నారు. ‘ఆత్మహత్య తప్పని తెలుసు. అమ్మా, నాన్న మన్నించండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాకు ఎవరూ అవసరం లేదు, ఒకసారి యాసిడ్ దాడి యత్నాన్ని, మరోసారి వేధింపుల్ని.. ఆపై ఎంతోమంది నుంచి రకరకాల వ్యాఖ్యలను ఎదుర్కొన్నా.. అందరికీ గుడ్ బై ఫర్ ఎవర్’’ అని చెబుతూ.. కాళ్లకింద ఉన్న స్టూల్ను తన్నేశారామె. ఇదంతా చూస్తున్న జగిత్యాలలోని ఆమె స్నేహితుడొకరు వెంటనే 100కు ఫోన్ చేశారు. ఈ సమాచారం అందగానే నారాయణగూడ పోలీసులు శివప్రసాద్, మధు ఆగమేఘాలపై ఆమె ఉండే అపార్టుమెంట్కు చేరుకున్నారు. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. మెడకు బిగించుకున్న చున్నీ ముడి అదృష్టవశాత్తు విడిపోవడంతో ఆమె మంచంపై పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లు గుర్తించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న హాసినిని ఎందుకు ఆత్మహత్యయత్నం చేశారని ప్రశ్నించగా.. ఆర్థిక ఇబ్బందులని తెలిపినట్లు పోలీసు అధికారి రవికుమార్ చెప్పారు. గురువారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాద్కు వచ్చి హాసినిని తమ స్వగ్రామమైన కృష్ణా జిల్లా వీరులపాడు మండలం బుధవాడ గ్రామానికి తీసుకెళ్లారు. ఈ పరిస్థితుల్లో ఆమె స్కూటీపై వచ్చి కీసర బ్రిడ్జిపై బండి పెట్టి మున్నేరులో దూకింది. స్థానికులు రక్షించి వెంటనే ఆమెను నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి గల కారణాలు తెలియడంలేదు. దీనిపై కంచికచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: నాగ్పుర్ పిచ్ ఏం చెబుతోంది?
-
Politics News
PM Modi: వారి ప్రవర్తన బాధాకరం.. విపక్షాలు విసిరే బురదలోనూ ‘కమలం’ వికసిస్తుంది: మోదీ
-
Movies News
Ott Movies: ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/ వెబ్సిరీస్లు
-
Sports News
IND vs AUS: రవీంద్రజాలంలో ఆసీస్ విలవిల.. 200లోపే ఆలౌట్
-
World News
Bill Gates: మళ్లీ ప్రేమలో పడిన బిల్గేట్స్..?
-
Movies News
Janhvi Kapoor: వాళ్ల సూటిపోటి మాటలతో బాధపడ్డా: జాన్వీకపూర్