Crime news: మాజీ మిస్ తెలంగాణ.. మరోసారి ఆత్మహత్యాయత్నం
జీవితంపై విరక్తితో హైదరాబాద్లో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించిన మోడల్ మరోసారి కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని కీసర బ్రిడ్జి పైనుంచి మున్నేరులో ..
నందిగామ: జీవితంపై విరక్తితో హైదరాబాద్లో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించిన మోడల్ మరోసారి కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని కీసర బ్రిడ్జి పైనుంచి మున్నేరులో దూకి ఆత్మహత్యకు యత్నించింది. స్థానికులు ఆమెను గుర్తించి వెంటనే మున్నేరు నీటిలో ఉన్న ఆమెను కాపాడి నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం బుధవాడ గ్రామానికి చెందిన కలక భవాని అలియాస్ హాసిని(21) హైదరాబాద్ హిమాయత్నగర్లోని ఓ అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటోంది. ఓ ప్రైవేటు సంస్థ 2018లో నిర్వహించిన పోటీలో ‘మిస్ తెలంగాణ’గా ఎంపికయ్యారు. హిమాయత్నగర్లోని ఒక అపార్టుమెంట్లో ఒంటరిగా ఉంటూ మోడలింగ్ చేస్తున్నారు. బుధవారం రాత్రి 10:30 గంటల సమయంలో చున్నీతో ఫ్యాన్కు ఉరి బిగించుకొని తన తల్లిదండ్రులు, స్నేహితులకు ఇన్స్టాగ్రామ్లో వీడియో కాల్ (కాన్ఫరెన్స్) చేశారు. కంగారుపడిన తల్లిదండ్రులు, స్నేహితులు ఫోన్లు చేస్తున్నా పట్టించుకోకుండా ఆమె తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెబుతూనే ఉన్నారు. ‘ఆత్మహత్య తప్పని తెలుసు. అమ్మా, నాన్న మన్నించండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాకు ఎవరూ అవసరం లేదు, ఒకసారి యాసిడ్ దాడి యత్నాన్ని, మరోసారి వేధింపుల్ని.. ఆపై ఎంతోమంది నుంచి రకరకాల వ్యాఖ్యలను ఎదుర్కొన్నా.. అందరికీ గుడ్ బై ఫర్ ఎవర్’’ అని చెబుతూ.. కాళ్లకింద ఉన్న స్టూల్ను తన్నేశారామె. ఇదంతా చూస్తున్న జగిత్యాలలోని ఆమె స్నేహితుడొకరు వెంటనే 100కు ఫోన్ చేశారు. ఈ సమాచారం అందగానే నారాయణగూడ పోలీసులు శివప్రసాద్, మధు ఆగమేఘాలపై ఆమె ఉండే అపార్టుమెంట్కు చేరుకున్నారు. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. మెడకు బిగించుకున్న చున్నీ ముడి అదృష్టవశాత్తు విడిపోవడంతో ఆమె మంచంపై పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లు గుర్తించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న హాసినిని ఎందుకు ఆత్మహత్యయత్నం చేశారని ప్రశ్నించగా.. ఆర్థిక ఇబ్బందులని తెలిపినట్లు పోలీసు అధికారి రవికుమార్ చెప్పారు. గురువారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాద్కు వచ్చి హాసినిని తమ స్వగ్రామమైన కృష్ణా జిల్లా వీరులపాడు మండలం బుధవాడ గ్రామానికి తీసుకెళ్లారు. ఈ పరిస్థితుల్లో ఆమె స్కూటీపై వచ్చి కీసర బ్రిడ్జిపై బండి పెట్టి మున్నేరులో దూకింది. స్థానికులు రక్షించి వెంటనే ఆమెను నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి గల కారణాలు తెలియడంలేదు. దీనిపై కంచికచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
ముంబయిలో రూ.6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురు వ్యక్తుల నుంచి 3 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షలో జవాబు పత్రం చూపించలేదని ఘోరం
పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
అయిదేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడి అరెస్టు
దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.