HYD: గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటన.. పోలీసుల అదుపులో నలుగురు
గాంధీ ఆస్పత్రిలో జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి చిలకలగూడ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి చిలకలగూడ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ ఉమామహేశ్వర్తో పాటు మరో ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని విచారిస్తున్నారు. దీంతో పాటు బాధిత మహిళ కనిపించిన స్థలంలో క్లూస్ బృందం ఆధారాలు సేకరించింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి సోదరి కనిపించకపోవడంతో ఆమె కోసం పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ ఛైరపర్సన్ సునీతా లక్ష్మారెడ్డి స్పందిస్తూ.. బాధితురాళ్లకు ప్రభుత్వం అండగా ఉంటుదన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్తో చర్చించిన ఆమె అనంతరం మీడియాతో మాట్లాడారు.
‘‘బాధితురాలు చెబితే తప్ప అసలేం జరిగిందో వివరించలేం. బాధితురాలితో ఇవాళే మాట్లాడతా. పూర్తి విచారణ జరిగిన తర్వాతే వాస్తవాలు వెల్లడవుతాయి. మరో బాధితురాలు ఎక్కడ ఉందో గుర్తించలేదు. దోషులపై కఠిన చర్యలు ఉంటాయి. చికిత్స కోసం వచ్చిన రోగి సమాచారం ఇవ్వకుండానే వెళ్లిపోయారు’’ అని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. గాంధీ ఆస్పత్రిలో తనతో పాటు తన సోదరిపై అత్యాచారం జరిగిందని బాధితురాలు నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
అత్యాచారం జరిగిందని తేలితే కఠిన చర్యలు: సూపరింటెండెంట్
గాంధీ ఆస్పత్రిలో జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించినట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. రాజారావు వెల్లడించారు. అత్యాచార ఆరోపణలపై కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యాచారం జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో 189 సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు. ఆరోపణలు రుజువుకాకుండా అసత్య ప్రకారం చేయొద్దని కోరారు.
చిలకలగూడ పీఎస్ వద్ద ఉద్రిక్తత..
మరోవైపు ఘటనకు సంబంధించిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న సమాచారంతో భాజపా మహిళా మోర్చా నేతలు చిలకలగూడ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పీఎస్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా భాజపా మహిళా మోర్చా నేత గీత మూర్తి మాట్లాడారు. ఆస్పత్రిలో అత్యాచారానికి పాల్పడటం సిగ్గుచేటన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సెక్యూరిటీ లోపం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం