Saidabad: రాజు మృతదేహానికి వరంగల్‌లో అంత్యక్రియలు

సైదాబాద్‌ హత్యాచార ఘటనలో నిందితుడు రాజు మృతదేహానికి వరంగల్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ సమీపంలో రైల్వేట్రాక్‌పై ఈరోజు ఉదయం రాజు

Updated : 09 Sep 2022 14:35 IST

వరంగల్ (కార్పొరేషన్‌)‌: సైదాబాద్‌ హత్యాచార ఘటనలో నిందితుడు రాజు మృతదేహానికి వరంగల్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ సమీపంలో రైల్వేట్రాక్‌పై ఈరోజు ఉదయం రాజు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో బంధువుల సమక్షంలో పోస్టు మార్టం పూర్తి చేశారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వరంగల్‌  పోతన నగర్‌లోని స్మశాన వాటికలో రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రాజు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

వరంగల్‌ మట్టెవాడ పోలీసుల సూచనతో గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రజారోగ్య విభాగం ఉద్యోగులు వరంగల్‌ పోతన నగర్‌ శ్మశానవాటికలో దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. వరంగల్‌ ఎంజీఎం మార్చురీలో పోస్టుమార్టం పూర్తి కాగానే పోలీసుల పహారా మధ్య రాజు మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించారు. అంత్యక్రియల క్రతువును నిందితుడు రాజు తల్లి పూర్తి చేశారు. ముగ్గురు కుటుంబ సభ్యులను మాత్రమే ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతించారు. పోతననగర్‌ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించే అంశాన్ని పోలీసులు చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని