Crime News: రాజేంద్రనగర్‌లో మహిళపై సామూహిక అత్యాచారం!

హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌లో దారుణం చోటుచేసుకుంది.

Updated : 14 Oct 2021 14:30 IST

రాజేంద్ర నగర్‌: హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఫురానాపూల్‌కు చెందిన మహిళ (30) రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలోని హైదర్‌గూడకు బుధవారం సాయంత్రం వచ్చింది. స్థానికంగా ఉండే ఓ కల్లు కాంపౌండ్‌లో కల్లు తాగేందుకు వెళ్లింది. అక్కడ పక్కనే కూర్చున్న ఓ ఆటో డ్రైవర్‌ మహిళను గమనించి ఆమెతో పరిచయం ఏర్పరచుకున్నాడు. 

ఈ క్రమంలో మాటా మాటా కలుపుతూ ఆమెను ఇంటి దగ్గర దించి వెళ్తానని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన మహిళ ఆటోలో వెళ్లింది. మరో ఇద్దరు వ్యక్తులు కూడా అదే ఆటో ఎక్కారు. అక్కడి నుంచి ఆమెను హిమాయత్‌సాగర్‌ సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన ముగ్గురు వ్యక్తులు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. మత్తు నుంచి కోలుకున్న బాధితురాలు గురువారం ఉదయం స్థానికుల సహకారంతో రాజేంద్రనగర్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు సీఐ కనకయ్య తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని