Crime News: అరకు TO ముంబయి వయా హైదరాబాద్... రైళ్లలో భారీగా గంజాయి తరలింపు
గంజాయి విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ నాంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.67లక్షల విలువ చేసే 336 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: గంజాయి విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ నాంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.67లక్షల విలువ చేసే 336 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలకు భారీ మొత్తంలో గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. విశాఖ నుంచి ముంబయి వెళ్లే ఎల్టీటీ ఎక్స్ప్రెస్ రైలులో లింగంపల్లిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలో ఏసీ బోగీలో ప్రయాణిస్తున్న ఏడుగురు మహిళలు, ఏడుగురు పురుషులు అక్రమంగా గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. 24 లగేజీ బ్యాగులలో అక్రమంగా తరలిస్తున్న రూ.67లక్షల విలువ చేసే 336 కేజీల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. అరకు నుంచి గంజాయి ముంబయి తరలిస్తున్నట్టు గుర్తించారు. అరకు సమీపంలో ఉన్న గ్రామాల్లో గంజాయి పండించే వారి వద్ద నుంచి ఈముఠా గంజాయి కొనుగోలు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ముఠాలోని మహిళలు పోలీసులకు అనుమానం రాకుండా ప్రయాణికుల ముసుగులో వ్యాపారం చేస్తున్నట్టు పేర్కొన్నారు. పసిపిల్లలను వెంటబెట్టుకొని విశాఖ, అరకు నుంచి గంజాయి తరలింపు భారీగా జరుగుతోందని, విశాఖ నుంచి వచ్చే రైళ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హైదరాబాద్ అర్బన్ రైల్వే డీఎస్పీ చంద్రబాను తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..