Goa Liquor: గోవా TO నరసరావుపేట@ అక్రమ మద్యం సరఫరా 

గుంటూరు జిల్లా నరసరావుపేట, వినుకొండ పరిధిలో రూ.6.5 లక్షల విలువైన మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ..

Updated : 05 Sep 2021 16:48 IST

నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట, వినుకొండ పరిధిలో రూ.6.5 లక్షల విలువైన మద్యం సీసాలను పోలీసులు సీజ్‌ చేశారు. నరసరావుపేట ఎస్ఈబీ అధికారులు ఆదివారం వాహనాల తనిఖీ చేపట్టగా లారీలో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురానికి చెందిన దండే క్రాంతికుమార్‌, కడపకు చెందిన దండే చైతన్యకుమార్‌లు గోవా నుంచి మద్యాన్ని అక్రమంగా తీసుకువచ్చి చుట్టుపక్కల గ్రామాల్లోని విక్రయదారులకు సరఫరా చేస్తున్నారని ఎస్‌ఈబీ అధికారులకు సమాచారం అందింది. దీంతో వాహన తనిఖీలు చేపట్టి మద్యం తరలిస్తున్న ఐషర్‌ లారీని పట్టుకున్నారు. తనిఖీల్లో సుమారు రూ.6.50 లక్షల విలువ చేసే 2005 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని లారీని సీజ్‌ చేశారు. అక్రమంగా గోవా నుంచి మద్యం తరలిస్తున్న ఐదుగురు నిందుతులను అదుపులోకి తీసుకున్నామని వారిపై కేసు నమోదు చేశామని చంద్రశేఖర రెడ్డి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని