Crime news: ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌లైట్‌లో 6 కిలోల బంగారం

శంషాబాద్‌ విమానాశ్రయంలో 6 కిలోల బంగారాన్ని మంగళవారం కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేశారు.  దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద అక్రమంగా బంగారం

Updated : 19 Oct 2021 16:51 IST

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో 6 కిలోల బంగారాన్ని మంగళవారం కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేశారు.  దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద అక్రమంగా బంగారం ఉన్నట్టు గుర్తించి అధికారులు తనిఖీ చేశారు. అతని వద్ద ఉన్న ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌లైట్‌లో 6 కిలోల బంగారం ఉండటంతో స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.3కోట్లు ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు అంచనావేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని