US: వాషింగ్టన్‌లో కాల్పుల కలకలం

అగ్రరాజ్యంలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి.

Updated : 18 Jul 2021 11:34 IST

వాషింగ్టన్‌: అగ్రరాజ్యంలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. వాషింగ్టన్‌లోని బేస్‌బాల్‌ స్టేడియం వెలుపల దుండగులు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. బేస్‌బాల్‌ స్టేడియంలో ఆట ప్రారంభానికి ముందు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. దీంతో వాషింగ్టన్‌ నేషనల్స్‌, సాన్‌డియాగో మధ్య జరగాల్సిన ఆట రద్దైంది. పోలీసులు స్టేడియం నుంచి ప్రేక్షకులను బయటకు పంపేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని