Crime News: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

నగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ముగ్గురు సభ్యుల గల ముంబయి ముఠాను

Updated : 06 Jan 2022 11:05 IST

హైదరాబాద్‌: నగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న ముగ్గురు సభ్యుల గల ముంబయి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఈ ముఠా డ్రగ్స్‌ను నగరానికి తీసుకొచ్చినట్లు తెలిపారు. నిందితుల వద్ద ఉన్న కొకైన్‌, హెరాయిన్‌ తదితర మత్తు పదార్థాలు సీజ్‌ చేశారు. పట్టుబడిన డ్రగ్స్‌ విలువ రూ.16లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముంబయి నుంచి డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

ఉత్తర, పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించి డ్రగ్స్‌ ముఠాను పట్టుకున్నారు. ముంబయికి చెందిన ప్రధాన నిందితుడు సోనీ పరారీలో ఉన్నాడు. ఇతనే ముంబయి నుంచి నగరానికి డ్రగ్స్‌ తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సోనీని అంతర్జాతీయ డ్రగ్స్‌ సరఫరాదారుడిగా భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ మధ్యాహ్నం మీడియాకు వివరాలు వెల్లడించనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని