Crime News: సైదాబాద్ ఘటన.. రంగంలోకి దిగిన 500 మంది పోలీసులు
సైదాబాద్ హత్యాచార నిందితుడి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. దాదాపు 500 మంది పోలీసులు నిందితుడు రాజు కోసం గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి
హైదరాబాద్: సైదాబాద్ హత్యాచార నిందితుడి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. దాదాపు 500 మంది పోలీసులు నిందితుడు రాజు కోసం గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మూడు కమిషనరేట్ల ఉన్నతాధికారులతో డీజీపీ మహేందర్ రెడ్డి సమీక్షించారు. నిందితుడి కోసం టాస్క్ఫోర్స్, ఎస్వోటీ పోలీసులు రంగంలోకి దిగారు. నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, లేబర్ అడ్డాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. నిందితుడు రాజుకు మద్యం అలవాటు ఉందనే సమాచారంతో నగరంలోని మద్యం, కల్లు దుకాణాల వద్ద పోలీసులు నిఘా పెట్టారు.
ఈ నెల 10న నిందితుడు బాలాపూర్లో తిరిగినట్లు సీసీ కెమెరా దృశ్యాలు లభ్యమైన విషయం తెలిసిందే. ఎల్బీ నగర్లోని మద్యం దుకాణానికి రాజు వెళ్లినట్లు పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. ఈ నేపథ్యంలో ఎల్బీ నగర్ ప్రధాన రహదారులు, వీధుల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు నిందితుడు మారు వేషాలతో తిరిగే అవకాశం ఉన్నందున, జుట్టు, గడ్డం వంటి మార్పులతో నిందితుడిని పోలి ఉండే చిత్రాలను హైదరాబాద్ పోలీసులు విడుదల చేశారు. నిందితుడ్ని పట్టించిన వారికి రూ.10లక్షలు రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. నిందితుడి ఆచూకీ తెలిసిన వారు 94906 16366 నంబరుకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ పోలీసులు ఇంత మొత్తంలో రివార్డు ప్రకటించిన దాఖలాలు లేవు.
పోలీసులు తెలిపిన నిందితుడి ఆనవాళ్లివే...
* నిందితుడి పేరు: పల్లకొండ రాజు, వయస్సు 30 సంవత్సరాలు
* 5.9 అడుగుల ఎత్తు
* టోపీ పెట్టుకొని ఎర్ర చేతిరుమాల ముఖానికి పెట్టుకున్నాడు.
* రెండు చేతులపైనా మౌనిక అని పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఫ్యాంట్, షర్ట్ ధరించి ఉన్నాడు.
* మద్యం సేవించే అలవాటు ఉంది. మద్యం మత్తులో ఫుట్పాత్పై ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు