IT Raids: హెటిరోపై కొనసాగుతున్న ఐటీ దాడులు.. రూ.150 కోట్లు స్వాధీనం!
హెటిరో డ్రగ్స్ సంస్థలపై నాలుగో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో రెండు
హైదరాబాద్: హెటిరో డ్రగ్స్ సంస్థలపై నాలుగో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. రెండు మూడు ప్రైవేటు లాకర్లలో దాదాపు రూ.150 కోట్లు నగదు ఐటీ బృందాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మూడు కిలోలకు పైగా బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి. స్వాధీనం చేసుకున్న నగదును కౌంటింగ్ చేయడానికి, నోట్ల పరిశీలన కోసం భారతీయ స్టేట్ బ్యాంకు చెందిన ప్రత్యేక బృందాలను రప్పించినట్లు సమాచారం.
ఈ బ్యాంకు అధికారుల బృందాలు నోట్లను పరిశీలించి కౌంటింగ్ పూర్తయ్యాక ఆ మొత్తాన్ని ఎస్బీఐ సెస్కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, నగదు, బంగారంపై ఆరా తీసేందుకు మరొక ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఆ బృందం నగదు, బంగారం స్వాధీనం చేసుకున్న ప్రైవేటు లాకర్లకు నిర్వహకులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.