Jharkhand: షాకింగ్.. ఆటోతో ఢీకొట్టి న్యాయమూర్తి దారుణ హత్య..!
ఝార్ఖండ్లోని ధన్బాద్ జిల్లాలో ఓ సిట్టింగ్ న్యాయమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. అదనపు సెషన్స్, జిల్లా కోర్టు జడ్జి జస్టిస్ ఉత్తమ్ ఆనంద్ను బుధవారం ఉదయం
రాంచీ: ఝార్ఖండ్లోని ధన్బాద్ జిల్లాలో ఓ సిట్టింగ్ న్యాయమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. జిల్లా కోర్టు అదనపు సెషన్స్ జడ్జి జస్టిస్ ఉత్తమ్ ఆనంద్ను బుధవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు ఆటోతో ఢీకొట్టి హత్య చేశారు. తొలుత ఈ ఘటనను పోలీసులు ప్రమాదంగా భావించగా.. సీసీటీవీ రికార్డులను పరిశీలించగా.. హత్య విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఘటనపై బార్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పోలీసులు కథనం ప్రకారం..
జస్టిస్ ఉత్తమ్ ఆనంద్ బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో జాగింగ్ చేసేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చారు. రోడ్డు పక్కన జాగింగ్ చేసుకుంటూ వెళ్తుండగా.. ఓ ఆటో వచ్చి ఆయనకు ఢీకొట్టి వేగంగా వెళ్లింది. తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆయనను అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ న్యాయమూర్తి కన్నుమూశారు. అయితే చనిపోయిన వ్యక్తి ఓ జడ్జి అని తెలియకపోవడంతో కొన్ని గంటల వరకు ఆయన మృతి విషయం బయటకు రాలేదు.
ఉదయం 7 గంటలవుతున్నా జస్టిస్ ఆనంద్ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వెంటనే గాలింపు చేపట్టడంతో ప్రమాదంలో గాయపడిన ఆసుపత్రిలో మరణించినట్లు తెలిసింది. దీంతో హిట్ అండ్ రన్గా పోలీసుల కేసు నమోదు చేశారు. అయితే, ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా.. అసలు విషయం బయటపడింది. వాహనంలోని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఆయనను ఢీకొట్టినట్లు తెలియడంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు.
కాగా.. ఘటనకు ఉపయోగించిన ఆటోను కొద్ది గంటల ముందే దొంగలించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇప్పటివరకు ఆటో డ్రైవర్, మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. జస్టిస్ ఆనంద్ ధన్బాద్లో అనేక మాఫియా హత్య కేసులను విచారించారు. ఇటీవల ఇద్దరు గ్యాంగ్స్టర్లకు బెయిల్ నిరాకరించారు. ఈ క్రమంలో ఆయన హత్యకు గురవడం కలకలం రేపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
మరోవైపు న్యాయమూర్తి హత్యపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీన్ని సుమోటో పరిగణించి విచారణ చేపట్టాలని కోరింది. దీనికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ స్పందిస్తూ.. ఈ విషయంపై ఝార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడానని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో ఉందని, ఎప్పటికప్పుడు తాము సమీక్షిస్తున్నామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్