Karvy Stock Broking case: హెచ్డీఎఫ్సీ ఫిర్యాదు.. మరోసారి పోలీస్ కస్టడీకి పార్థసారథి
షేర్లు తనఖా ఉంచి బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగవేసిన కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ అక్రమాలు పోలీసుల దర్యాప్తులో మరిన్ని వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో అభియోగాలు
హైదరాబాద్: షేర్లు తనఖా ఉంచి బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగవేసిన కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ అక్రమాలు పోలీసుల దర్యాప్తులో మరిన్ని వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కార్వీ సంస్థ ఛైర్మన్ పార్థసారథిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకును మోసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న పార్థసారథిని విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్నారు. పార్థసారథిని రెండు రోజుల పాటు కస్టడీలోకి తసుకున్న సీసీఎస్ పోలీసులు ఇవాళ, రేపు ప్రశ్నించనున్నారు. పెట్టుబడిదారుల షేర్లను తనఖా పెట్టి హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి రూ.347 కోట్లు తీసుకున్నట్లు పార్థసారథిపై అభియోగాలున్నాయి. తిరిగి చెల్లించకపోవడంతో పార్థసారథిపై హెచ్డీఎఫ్సీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. పార్థసారథిని సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం ఇది మూడో సారి కావడం గమనార్హం.
ఇప్పటికే సీసీఎస్ పోలీసులు రెండు సార్లు కస్టడీకి తీసుకొని ప్రశ్నించారు. ఇండస్ ఇండ్ బ్యాంకులో తనఖా పెట్టిన షేర్లకు సంబంధించిన పూర్తి వివరాలను పార్థసారథి నుంచి సేకరించారు. పెట్టుబడిదారులకు చెందిన డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను బ్యాంకులో తనఖా పెట్టి రూ.137 కోట్లను పార్థసారథి రుణంగా తీసుకున్నారు. కార్వీ సంస్థ లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని సీసీఎస్ పోలీసులు రాబట్టారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్తో పాటు అనుబంధ సంస్థలకు చెందిన ఆరు బ్యాంకు ఖాతాలను ఇప్పటికే సీసీఎస్ పోలీసులు స్తంభింపజేశారు. దర్యాప్తులో భాగంగా పార్థసారథి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సీసీఎస్ పోలీసులు కార్వీ సంస్థ సీఎఫ్వో కృష్ణహరి, సీఈవో రాజీవ్ సింగ్ను నిన్న అరెస్టు చేశారు. డొల్ల కంపెనీల పేరుతో కృష్ణ హరి, రాజీవ్ మోసగించినట్లు పోలీసులు గుర్తించారు. పార్థసారథి ఆదేశాలతోనే డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసినట్లు తేల్చారు. ఏడేళ్లుగా ఈ ఇద్దరు నిందితులు డొల్ల కంపెనీలను నిర్వహిస్తున్నట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన ఇద్దరినీ పోలీసులు రిమాండ్కు తరలించారు. తాజాగా హెచ్డీఎఫ్సీ ఫిర్యాదు మేరకు పార్థసారథిని పోలీసులు మరోసారి కష్టడీలోకి తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ