Crime News: పొలాల్లో బాలుడి మృతదేహం.. చిత్తూరు జిల్లాలో దారుణం

చిత్తూరు జిల్లా కమ్మంవారి పల్లిలో దారుణం చోటు చేసుకుంది. నిన్న అదృశ్యమైన చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.  ఎంవీ పల్లి పంచాయతీ ఎగువమేకలవారి....

Updated : 13 Oct 2021 16:46 IST

కేవీ పల్లి(కమ్మంవారి పల్లి): చిత్తూరు జిల్లా కమ్మంవారి పల్లిలో దారుణం చోటు చేసుకుంది. నిన్న అదృశ్యమైన చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎంవీ పల్లి పంచాయతీ ఎగువమేకలవారి పల్లికి సమీపంలో పొలాల్లో బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని గేరంపల్లి పంచాయతీ సంకేనిగుట్టపల్లికి చెందిన నాగిరెడ్డి దంపతులు తమ కుమారుడు తేజశ్‌ రెడ్డి(8)ని పీలేరులోని బంధువుల ఇంట్లో వదిలి.. భార్యాభర్తలిద్దరూ ఉపాధి నిమిత్తం కువైట్‌ వెళ్లారు. కాగా, సోమవారం బాలుడు తన అమ్మమ్మ స్వగ్రామమైన ఎగువమేకలవారి పల్లెకు వచ్చాడు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో తేజశ్‌ రెడ్డి తన అమ్మమ్మకు చెప్పి ఆడుకునేందుకని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తర్వాత ఎంతసేపటికీ ఇంటికి రాకపోయేసరికి కుటుంబసభ్యులు చుట్టుపక్కలంతా వెతకగా ఫలితం లేకపోయింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న కమ్మంవారిపల్లె పోలీసులు.. బాలుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం గ్రామానికి సమీపంలోని పొలంలో బాలుడు మృతిచెంది ఉండటం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని