Crime news: లైన్మెన్ బంగార్రాజు హత్యకేసులో కోరాడ గోవింద్ అరెస్టు
విశాఖలో కలకలం రేపిన విద్యుత్శాఖ లైన్మెన్ బంగార్రాజు హత్యకేసులో ప్రధాన నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు.
విశాఖపట్నం: విశాఖలో కలకలం రేపిన విద్యుత్శాఖ లైన్మెన్ బంగార్రాజు హత్యకేసులో ప్రధాన నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. పద్మనాభం మండలం ఏనుగులపాలెంలో వారం రోజుల క్రితం బంగార్రాజు హత్యకు గురైన విషయం తెలిసిందే. కేసు నమోదు చేయడం, నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు జాప్యం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబుతో పాటు, బాధితులు ఆరోపించారు. దీనిపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్కు చంద్రబాబు లేఖ కూడా రాశారు. దీంతో స్పందించిన పోలీసులు హత్యకేసు దర్యాప్తును వేగవంతం చేశారు.
డీసీపీ గౌతమి సాలి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించి హత్యకేసు వివరాలను వెల్లడించారు. బంగార్రాజు హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని వెల్లడించారు. ‘‘తనకు రాజకీయ నాయకులు తెలుసని, విద్యుత్ శాఖలో షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని కోరాడ గోవింద్ చెప్పడంతో అతన్ని నమ్మిన బంగార్రాజు నిరుద్యోగుల నుంచి రూ.3లక్షలు, రూ.3.50లక్షలు చొప్పున వసూలు చేశాడు. నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన రూ.30లక్షలు గోవింద్కు ఇచ్చాడు. కానీ రోజులు గడుస్తున్నా గోవింద్ ఉద్యోగాలు ఇప్పించలేదు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వివాదమేర్పడింది. ఈనేపథ్యంలో అక్టోబరు 31న బంగార్రాజు హత్యకు గురయ్యాడు. కోరాడ లక్ష్మణరావు గెస్ట్హౌస్ పక్కన బంగార్రాజు మృతదేహం ఉందని సమాచారం వచ్చింది. బంగార్రాజు భార్య నందిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. బంగార్రాజు హత్యలో ఎలాంటి రాజకీయ కోణం లేదు. ఈకేసులో ప్రధాన నిందితుడు కోరాడ గోవింద్ను అరెస్టు చేశాం. ఈ హత్యలో కోరాడ లక్ష్మణరావు, పైడి రాజు, వెంకటేశ్ హస్తం ఉందని ఫిర్యాదు అందింది. వారి పాత్ర ఎంతవరకు ఉందనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. గోవింద్ తీసుకున్న రూ.30లక్షలు ఎవరి వద్ద ఉన్నాయనే దానిపై కూడా ఆరా తీస్తున్నాం. సేకరించిన సాంకేతిక ఆధారాలను కోర్టుకు సమర్పిస్తాం’’ అని డీసీపీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
చైనాకు చెందిన ఓ మహిళ(31) అగ్నిపర్వతం అంచున ఫొటో తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు అందులో పడి మరణించిన ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
సస్పెన్షన్కు గురైన సబ్రిజిస్ట్రార్ ఇంట్లో అనిశా తనిఖీలు.. రూ. 10 కోట్ల ఆస్తుల గుర్తింపు
మహబూబాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత నెల 22న లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కిన సబ్రిజిస్ట్రార్ తస్లీమ మహ్మద్ ఇంట్లో అధికారులు సోమవారం మరోసారి తనిఖీలు నిర్వహించారు. -
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
చదువుపై మక్కువతో నవ వధువు బలవన్మరణం
ఉన్నత చదువులు చదువుకుంటానని చెప్పినా కుటుంబసభ్యులు వివాహం చేయడంతో నవ వధువు పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం మంగయ్యబంజర్ గ్రామంలో చోటుచేసుకుంది. -
మహిళపై అమానుషానికి పాల్పడింది సంగారెడ్డి యువకులు!
మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన కేసులో పోలీసులు నిందితులను గుర్తించినట్లు తెలిసింది. -
ఏపీలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడి అరెస్టు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడు బోయ మహానందిని మూడో పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. -
మంచులో కూరుకుపోయి తెలుగు వైద్య విద్యార్థి మృతి
వైద్య విద్య కోసం కిర్గిజ్స్థాన్ వెళ్లిన తెలుగు విద్యార్థి అక్కడి జలపాతం సందర్శనకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. -
మూడు పదులు నిండకుండానే ముగిసిన జీవితాలు
పట్టుమని 30 ఏళ్లు కూడా నిండలేదు.. రెండేళ్ల కిందటే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ.. ఆనందంగా జీవిస్తున్న ఆ దంపతుల ఆశలు అర్ధంతరంగా ఆవిరైపోయాయి. -
పంట నష్టాలతో రైతు ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా మరిపెడ శివారు మాకుల తండాలో ఇస్లావత్ చీనా(42) అనే రైతు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయంలో నష్టం, ఆర్థిక సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. -
రాళ్లు విసిరి.. జెండా కర్రలతో కొట్టి
తెదేపా ఎస్సీ కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. సత్తెనపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సోమవారం నామినేషన్ వేశారు. -
పల్నాడు జిల్లాలో తెదేపా కార్యాలయానికి నిప్పు
పల్నాడు జిల్లాలో వైకాపా నాయకులు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం రాత్రి బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలంలో తెదేపా కార్యాలయం వద్ద తాటాకు పందిరికి నిప్పు పెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!