TS News: క్వారీలో టిప్పర్‌ బోల్తా.. ముగ్గురి మృతి

హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి శివారు గాయత్రి క్వారీలో విషాదం చోటు చేసుకుంది.

Published : 19 Dec 2021 01:27 IST

కాజీపేట: హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి శివారు గాయత్రి క్వారీలో విషాదం చోటు చేసుకుంది. టిప్పర్ లారీ బోల్తా పడి ముగ్గురు దుర్మరణం చెందారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తికి చెందిన చందు, గూడురు మండలం బొద్దుగొండకు చెందిన ముఖేష్, జార్ఖండ్‌కు చెందిన అఖీమ్.. ఈ ప్రమాదంలో మృతి చెందారు. వేగంగా వచ్చిన టిప్పర్ అదుపుతప్పి క్వారీలో పనిచేస్తున్న ముగ్గురిపై పడటంతో ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలంలోనే ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మృతదేహాలను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై మడికొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని