AP News: తనిఖీ పేరుతో డ్రైవర్‌ను కిందకు దించి.. లారీతో ఉడాయించి

ప్రకాశం జిల్లా టంగుటూరు సమీపంలో దుండగులు లారీని అపహరించారు.

Published : 27 Jul 2021 10:31 IST

టంగుటూరు: ప్రకాశం జిల్లా టంగుటూరు సమీపంలో దుండగులు లారీని అపహరించారు. నెల్లూరు నుంచి ఒంగోలు వస్తున్న లారీని సెబ్‌ అధికారులమంటూ కొందరు వ్యక్తులు ఆపారు. తనిఖీ చేయాలంటూ లారీ నుంచి డ్రైవర్‌ కిందకు దించారు. అనంతరం వారు అతడిని బెదిరించి లారీతో ఉడాయించారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే స్పందించిన ఎస్పీ మాలిక గార్గ్‌ దుండగుల గాలింపు కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు.    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని