AP News: గుంటూరు జిల్లాలో దారుణం.. ప్రేమించాడని గొంతుకోసి చంపేశారు 

గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం పల్లపాడులో ఐదు రోజుల క్రితం జరిగిన బండారు గోపి (19) హత్య కేసును చేబ్రోలు పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు కులాంతర

Updated : 17 Oct 2021 02:01 IST

అమరావతి: గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం పల్లపాడులో ఐదు రోజుల క్రితం జరిగిన బండారు గోపి (19) హత్య కేసును చేబ్రోలు పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు కులాంతర ప్రేమే కారణమని పోలీసులు గుర్తించారు. గోపి హత్య కేసులో మొత్తం 11 మంది నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హత్యకు సంబంధించిన వివరాలను గుంటూరు దక్షిణ మండల డీఎస్పీ జెస్సీ ప్రశాంతి మీడియాకు వెల్లడించారు.

పల్లపాడు గ్రామానికి చెందిన గోపి అదే గ్రామంలోని ఓ యువతిని ప్రేమించాడు. విషయం తెలుసుకున్న యువతి బంధువులు గోపిని మందలించారు. ఎన్నిసార్లు హెచ్చరించినా గోపి ఖాతరు చేయకపోవడంతో హత్యకు పథకం పన్నారు. ముందుగా స్నేహితుల సాయంతో గోపిని నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. తర్వాత కర్రలతో అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం ఆటోలో అప్పాపురం కాలువ వద్దకు తీసుకువచ్చి అక్కడ కత్తితో గొంతుకోసి హత్య చేశారు. మృతదేహాన్ని సంచిలో మూటకట్టి పైకి తేలకుండా రాళ్లతో కట్టేసి అప్పాపురం కాలువలో పడేశారు. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి నాలుగు కత్తులు, కర్రలు, నైలాన్‌ తాళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ  వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని