Hyderabad News: ప్రియురాలిని చంపి ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు

హైదరాబాద్‌ మాదాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో ప్రేయసిని చంపి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు మహబూబ్‌నగర్‌కు

Published : 30 Jul 2021 01:19 IST

మాదాపూర్: హైదరాబాద్‌ మాదాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. మాదాపూర్‌లోని లెమన్‌ ట్రీ హోటల్‌లో ప్రేయసిని చంపి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. యువతిని బ్లేడుతో గొంతు కోసి బాత్రూంలో పడేసిన యువకుడు అనంతరం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న మాదాపూర్‌ పోలీసులు వివరాలు సేకరించారు. మృతులు మహబూబ్‌నగర్‌కు చెందిన సంతోషి, రాములుగా గుర్తించారు. నిన్న మధ్యాహ్నం లెమన్ ట్రీ హోటల్‌లో రాములు గది తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్‌ పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని