Crime news: పెద్దలు అంగీకరించలేదని ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

గుంటూరు జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. దాచేపల్లి మండలం బట్రుపాలెం శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీకాంత్‌, ఓ యువ..

Published : 22 Aug 2021 01:06 IST

దాచేపల్లి: గుంటూరు జిల్లా పల్నాడులో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. దాచేపల్లి మండలం నడికుడి గ్రామానికి చెందిన శ్రీకాంత్‌, గురజాల మండలం అంబాపురం గ్రామానికి చెందిన ఓ యువతి గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ ఒకే కళాశాలలో విద్యనభ్యసించారు. వారి ప్రేమను తల్లిదండ్రులు నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురై శనివారం మధ్యాహ్నం భట్రుపాలెం సమీపంలో కృష్ణానది ఒడ్డున  పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నారాయణపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి వారిని గుంటూరు తరలించారు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని