Crime News: పెద్దలను కాదనలేక.. ప్రేమను చంపుకోలేక యువ జంట బలవన్మరణం

నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం తెట్టేకుంట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పెద్దలను కాదనలేక.. ప్రేమను చంపుకోలేక యువ జంట బలవన్మరణానికి పాల్పడింది...

Updated : 24 Oct 2021 16:29 IST

తిరుమలగిరి: నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం తెట్టేకుంట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పెద్దలను కాదనలేక.. ప్రేమను చంపుకోలేక యువ జంట బలవన్మరణానికి పాల్పడింది. క్రిమిసంహారక మందు తాగి ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెట్టేకుంట గ్రామానికి చెందిన మిట్టపల్లి కొండల్‌ (22), సంధ్య (19) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల సంధ్యకు వేరొకరితో వివాహం నిశ్చయించారు. పెద్దలమాట కాదనలేక, ప్రేమ విషయం చెప్పలేక కుమిలిపోయారు. దీంతో ఇద్దరూ కలిసి 3రోజుల క్రితం కొండల్‌ ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన కుంటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నల్గొండ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సాగర్‌ ఆసుపత్రికి తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని