Crime News: మామ కుటుంబంపై కత్తితో అల్లుడు దాడి

కృష్ణా జిల్లా మైలవరం మండలం వెదురుబీడెంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో అల్లుడు

Updated : 18 Oct 2021 11:38 IST

నలుగురికి గాయాలు.. చికిత్స పొందుతూ మామ మృతి 
కృష్ణా జిల్లాలో ఘటన

మైలవరం: కృష్ణా జిల్లా మైలవరం మండలం వెదురుబీడెంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో నలుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెదురుబీడెం గ్రామానికి చెందిన కొలుసు కొండలరావు (40)కు ముగ్గురు కుమార్తెలు. మొదటి కుమార్తె ధనలక్ష్మిని గన్నవరం మండలం బల్లిపర్రుకు చెందిన వీర్ల రాంబాబు (30)తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. 

పెళ్లి సమయంలో కట్నంగా ఇచ్చిన భూమిని అమ్మాలని రాంబాబు రోజూ గొడవ చేస్తున్నాడు. దీంతో ధనలక్ష్మి ఆదివారం సాయంత్రం పుట్టింటికి వచ్చింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మామ ఇంటికి రాంబాబు వెళ్లాడు. నిద్రిస్తున్న మామ కొండలరావుతో పాటు అత్త, భార్య, మరదలిపై కత్తితో దాడి చేశాడు. గాయపడిన వారిని స్థానికులు 108లో మైలవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో భార్య, అత్తమామల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో విజయవాడ తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మామ కొండలరావు మృతిచెందారు. అత్త పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నట్లు ఎస్సై రాంబాబు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని