Crime News: మరో వ్యక్తితో నిశ్చితార్థం.. యువతిపై ప్రేమోన్మాది దాడి
ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందనే అక్కసుతో ఓ ప్రేమోన్మాది ఆమెపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్
నాగోలు: ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందనే అక్కసుతో ఓ ప్రేమోన్మాది ఆమెపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్ ఠాణా పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలానికి చెందిన యువతి (20), అదే ప్రాంతానికి చెందిన బస్వరాజ్ (23) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, వీరి ప్రేమను యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు.
3 నెలల క్రితం యువతికి మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. బస్వరాజ్తో ప్రేమ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు.. నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి యువతిని నగరంలోని హస్తినాపురంలో నివాసం ఉంటున్న ఆమె బాబాయి ఇంట్లో ఉంచారు. సన్సిటీ సమీపంలోని రామ్దేవ్గూడలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న బస్వరాజ్కు ఈ విషయం తెలిసింది. ఇవాళ మధ్యాహ్నం యువతి ఉంటున్న ఇంటికి చేరుకొని ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి పొట్ట, వీపు భాగంలో తీవ్రగాయాలయ్యాయి. గమనించిన కుటుంబసభ్యులు యువతిని హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దాడి అనంతరం నిందితుడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
యువతి శరీరంపై 18 చోట్ల కత్తిపోట్లు
దాడిలో గాయపడిన యువతి శరీరంపై 18 చోట్ల కత్తి పోట్లు ఉన్నాయని చికిత్స అందిస్తున్న నవీన ఆసుపత్రి వైద్యులు రణధీర్ తెలిపారు. ఛాతీ, ఊపిరిత్తుల భాగంలో మేజర్ గాయాలయ్యాయని చెప్పారు. ప్రస్తుతం అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నామని, 48 గంటలు గడిస్తే గాని బాధితురాలి పరిస్థితి చెప్పలేమని వెల్లడించారు.
పెళ్లి ఆపేస్తానని బెదిరించాడు: బాధితురాలు
‘‘వేరే పెళ్లి చేసుకుంటున్నానని బస్వరాజ్ కత్తితో పొడిచాడు. గతంలో ఇద్దరం ప్రేమించుకున్నాం. ఇంట్లో ఒప్పుకోకపోవడంతో వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. వేరే వ్యక్తితో నిశ్చితార్థం ఎందుకు చేసుకున్నావని బస్వరాజ్ నిలదీశాడు. పెళ్లి ఆపేస్తానని బెదిరించాడు’’ అని బాధితురాలు జరిగిన ఘటనపై పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
సీఎం జగన్పై రాయిదాడి కేసులో నిందితుడికి విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. -
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
సీఎం జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడిని విజయవాడ అజిత్సింగ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు సహా ఐదుగురిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం