Crime News: హైదరాబాద్‌లో దారుణం.. భార్యను చంపేసి తలతో పోలీస్‌స్టేషన్‌కు!

నగరంలో దారుణం జరిగింది. రాజేంద్రనగర్‌ పరిధిలోని ఇమాద్‌నగర్‌లో భార్యను ఓ వ్యక్తి కిరాతకంగా హత్య చేశారు.

Updated : 10 Dec 2021 13:22 IST

హైదరాబాద్‌: నగరంలో దారుణం జరిగింది. రాజేంద్రనగర్‌ పరిధిలోని ఇమాద్‌నగర్‌లో భార్యను ఓ వ్యక్తి కిరాతకంగా హత్య చేశారు. నిద్రిస్తున్న భార్య గొంతుకోసి చంపేశాడు. అనంతరం భార్య తల తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. 

వివరాల్లోకి వెళితే.. 14 ఏళ్ల క్రితం ఫర్వేజ్‌తో సమ్రీన్‌ బేగంకు వివాహం జరిగింది. భర్త వేధింపులు తాళలేక సమ్రీన్‌ గతంలో విడాకులు తీసుకున్నారు. అనంతరం సమ్రీన్‌కు నచ్చజెప్పి గతేడాది మళ్లీ పెళ్లి చేశారు. అయితే భార్యపై అనుమానంతోనే ఫర్వేజ్‌ ఆమెను హతమార్చినట్లు స్థానికులు తెలిపారు. గంజాయి మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెబుతున్నారు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని