Crime News: విజయవాడ.. పార్క్‌ చేసిన కారులో మృతదేహం కలకలం

విజయవాడ నగరంలో కారులో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడం కలకలం రేపింది.

Updated : 19 Aug 2021 14:00 IST

విజయవాడ: విజయవాడ నగరంలో కారులో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. మ్యానర్‌ ఫుడ్‌ ప్లాజా ఎదురు రోడ్డులో పార్కు చేసి ఉన్న కారులో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడిని జడ్‌ఎక్స్‌ఎన్‌ సిలిండర్ల కంపెనీ యజమాని, తాడిగడపకు చెందిన రాహుల్‌గా నిర్ధరణకు వచ్చారు. జి. కొండూరు మండలం చెరువు మాధవరంలో ఆయన కంపెనీ ఉంది. బుధవారం సాయంత్రం 7.30 గంటలకు ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు గురువారం ఉదయం పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు టవర్‌ లొకేషన్‌ పరిశీలించగా మ్యానర్‌ ఫుడ్‌ ప్లాజా ఎదురుగా చూపించింది. వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి చూస్తే కారులో మృతదేహం కనిపించింది. హత్య, ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు క్లూస్‌ టీం సహాయంతో విచారణ చేపట్టారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలాన్ని ఇన్‌ఛార్జ్‌ సీపీ పాలరాజు పరిశీలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని