Ts news: ఆత్మహత్యకు యత్నిస్తే.. ప్రాణభీతి వెంటాడింది!

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక వంతెనపై నుంచి మధ్యమానేరు ప్రాజెక్టు జలాశయంలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు.

Published : 24 Oct 2021 01:23 IST

కరీంనగర్‌: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక వంతెనపై నుంచి మధ్యమానేరు ప్రాజెక్టు జలాశయంలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. అయితే, నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి చెట్టు కొమ్మలు పట్టుకుని రక్షించమని వేడుకున్నాడు. అతని అరుపులతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. జలాశయంలో చేపలుపట్టే మత్స్యకారులు తెప్పలసాయంతో కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరి క్షణాల్లో చెట్టు కొమ్మల సాయంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ వ్యక్తి రెండు గంటలపాటు భయంతో వణికిపోయాడు. మత్స్యకారులు, గజ ఈతగాళ్లు చీకటి పడే సమయానికి అతన్ని బయటకు తీశారు. తనను రక్షించిన వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని కరీంనగర్‌లోని కిసాన్‌నగర్‌కు చెందిన ముల్కల దేవయ్యగా గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని