డీజీపీ ఎదుట మావోయిస్టు నేత లొంగుబాటు

మావోయిస్టు నేత, ప్లాటూన్‌ పార్టీ కమిటీ మెంబర్‌ రావుల రంజిత్‌ అలియాస్‌ శ్రీకాంత్‌ తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి ..

Updated : 14 Jul 2021 13:03 IST

హైదరాబాద్‌: మావోయిస్టు నేత, ప్లాటూన్‌ పార్టీ కమిటీ మెంబర్‌ రావుల రంజిత్‌ అలియాస్‌ శ్రీకాంత్‌ తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మావోయిస్టు కార్యక్రమాలపై రంజిత్‌ విరక్తి చెంది లొంగుబాటుకు అనుమతి కోరారన్నారు. పాఠశాల వయసు నుంచే మావోయిస్టు కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారని చెప్పారు. ప్రస్తుత మావోయిస్టు భావజాలంతో ఎలాంటి ఉపయోగం లేదనేది రంజిత్‌ అభిప్రాయమన్నారు. మిగిలిన మావోయిస్టులను కూడా లొంగిపోవాలని తమ ద్వారా ఆయన విజ్ఞప్తి చేస్తున్నట్లు డీజీపీ చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని