Crime News: భద్రాద్రిలో లొంగిపోయిన 52 మంది మావోయిస్టు సానుభూతిపరులు

భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా చర్లలో గురువారం జిల్లా ఎస్పీ సునీల్‌ దత్‌ ఎదుట 52 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, సానుభూతిపరులు

Published : 10 Sep 2021 01:53 IST

చర్ల: భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా చర్లలో గురువారం జిల్లా ఎస్పీ సునీల్‌ దత్‌ ఎదుట 52 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, సానుభూతిపరులు లొంగిపోయారు. మండలంలోని పూషుగుప్ప, భట్టిగూడెం, బత్తినపల్లి, చెన్నాపురం గ్రామాలకు చెందిన మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారిలో ఐదుగురు మహిళలు ఉన్నట్లు చెప్పారు. మావోయిస్టులు తమ కార్యకలాపాలు వీడి ఇకనైనా జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ సూచించారు. సమావేశంలో ఓఎస్డీ తిరుపతి, ఏఎస్పీ వినీత్‌, సీఐ అశోక్‌, తదితర అధికారులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని