Crime news: ప్రయాణికుల కళ్లెదుటే.. రైలుకు ఎదురు నిలబడి వ్యక్తి ఆత్మహత్య

పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది.  ప్లాట్‌ఫాం మీదకు వస్తున్న రైలుకు ఎదురు నిలబడి వలస కూలీ ఆత్మహత్యకు ..

Updated : 07 Dec 2022 16:29 IST

రామగుండం:  ప్రయాణికులు అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి  రైలుకు ఎదురు నిలబడి ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఒడిశాలోని కైరాకు చెందిన సంజయ్‌ కుమార్‌ (27) తన తాతతో కలిసి హైదరాబాద్‌లోని ఓ హార్డ్‌వేర్‌ దుకాణంలో పనిచేస్తున్నాడు. గత మూడేళ్లుగా మతి స్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్న సంజయ్‌కు కుటుంబ సభ్యులు వైద్యం  చేయిస్తున్నట్టు జీఆర్‌పీ హెడ్‌ కానిస్టేబుల్‌ సురేశ్‌ తెలిపారు.  గత కొన్ని రోజులుగా మతి స్థిమితం లేకుండా తిరుగుతున్న సంజయ్‌  హైదరాబాద్‌ నుంచి ఈరోజు ఉదయం రామగుండం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. న్యూదిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న రాజధాని సూపర్‌ ఫాస్ట్‌ రైలు ఎదురుగా వెళ్లి  ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రైల్వే స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.  రైలు వస్తుందని  ప్రయాణికులు వారిస్తున్నా వినకుండా.. పట్టాలపై  రైలుకు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకున్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని