Suicide: బిడ్డకు జన్మనిచ్చి.. బావిలో దూకి బాలిక బలవన్మరణం
గుర్తుతెలియని వ్యక్తి మాయమాటలను ఆ బాలిక నమ్మింది. చివరికి గర్భం దాల్చింది. తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం చేయలేక, అతని మోసాన్ని ‘కడుపు’లోనే
కామారెడ్డి నేరవిభాగం, గాంధారి, న్యూస్టుడే: గుర్తుతెలియని వ్యక్తి మాయమాటలను ఆ బాలిక నమ్మింది. చివరికి గర్భం దాల్చింది. తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం చేయలేక, అతని మోసాన్ని ‘కడుపు’లోనే దాచుకుంది. 9నెలలపాటు మానసిక సంఘర్షణకు గురవుతూ నరకం అనుభవించింది. చివరికి బలవన్మరణానికి పాల్పడింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని ఓ తండాలో బుధవారం ఈ దారుణం జరిగింది. గాంధారి ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన ఓ బాలిక (16)ది వ్యవసాయ కుటుంబం. 5వ తరగతి వరకూ చదువుకుంది. వ్యవసాయ పనులకు వెళ్లేది. బుధవారం తెల్లవారుజామున తండా శివార్లలో మగబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి కాకుండానే తల్లిగా మారాననే బాధ, భవిష్యత్తులో తలెత్తే సవాళ్లు, అవమానాలను తట్టుకోవడం కష్టమేననే బాధతో కుమిలిపోయింది. శిశువును పొదల్లో విసిరేసి, సమీపంలోని బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. శిశువును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. ఆమెను మోసగించిన వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్