అయ్యో ఏం కష్టమొచ్చిందో.. కుమార్తెను నడుముకు కట్టుకుని తల్లి ఆత్మహత్య!

తొమ్మిది నెలల చిన్నారితో కలిసి వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండల కేంద్రంలో

Updated : 02 Dec 2021 11:53 IST

మిడ్జిల్‌: తొమ్మిది నెలల చిన్నారితో కలిసి వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండల కేంద్రంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిమ్మాజీపేట మండలం గుమ్మకొండ గ్రామానికి చెందిన సరిత(20)కు మిడ్జిల్‌ గ్రామానికి చెందిన శ్రీశైలంతో రెండేళ్ల కిందట వివాహమైంది. వీరికి తొమ్మిది నెలల చిన్నారి ఉంది. కుటుంబ కలహాల నేపథ్యంలో సరిత మనస్తాపానికి గురై చిన్నారితో కలిసి రెండు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయింది. తల్లి, బిడ్డ కోసం కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది. 

దీంతో స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అదృశ్యం కేసుగా నమోదు చేసిన పోలీసులు.. వారి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం ఉదయం గ్రామ శివారులోని నీటి కుంటలో తల్లి, కుమార్తె మృతదేహాలను స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారిని సరిత తన నడుముకు కట్టుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దృశ్యం అక్కడి వారిని కలచివేసింది. ఘటనాస్థలికి చేరుకొన్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై జయప్రసాద్‌ తెలిపారు. కాగా, కుటుంబసభ్యుల వేధింపులు తట్టుకోలేకే సరిత బలవన్మరణానికి పాల్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు