AP News: రైలు కింద పడి తల్లీకుమారుడు ఆత్మహత్య

రైల్వే సిబ్బంది పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ రామారావు ఆధ్వర్యంలో రైల్వే పోలీసులు

Updated : 24 Jul 2021 10:43 IST

ఒంగోలు నేరవార్తలు: రైలు కింద పడి తల్లి, కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఒంగోలు రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక చోటు చేసుకుంది. సుమారు 30 ఏళ్ల వయసు కలిగిన ఓ మహిళ, 6 ఏళ్ల వయసున్న ఓ బాలుడి మృతదేహాలను ఈ తెల్లవారుజామున గుర్తించిన రైల్వే సిబ్బంది పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ రామారావు ఆధ్వర్యంలో రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతులని గుర్తించేందుకు ఘటనా స్థలంలో ఎటువంటి ఆధారాలు లభించలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని