Crime News: పంజాగుట్ట బాలిక హత్య కేసు.. తల్లే హంతకురాలు!
నగరంలోని పంజాగుట్టలో జరిగిన బాలిక హత్య కేసులో చిన్నారి తల్లితో సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: నగరంలోని పంజాగుట్టలో జరిగిన బాలిక హత్య కేసులో చిక్కుముడి వీడింది. ఈ కేసులో చిన్నారి తల్లితో సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని తల్లే ప్రియుడితో కలసి కుమార్తెను హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. రాజస్థాన్లోని అజ్మేర్లో తల్లి హీనాబేగం, ప్రియుడు షేక్ మహ్మద్ ఖాదర్ను నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్టలోని ద్వారకాపురికాలనీలో ఒక దుకాణం ముందు ఎనిమిది రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో బాలిక మృతదేహం పోలీసులకు కనిపించింది. అప్పటి నుంచి పోలీసులు హంతకుల కోసం గాలిస్తున్నారు. ఘటనా స్థలానికి కొంత దూరంలో లభించిన కీలకాధారంతో నిందితులను గుర్తించారు. ఘటనకు సంబంధించి ఈ మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించి పోలీసులు వెల్లడించారు.
షేక్పేటలో ఉంటే ఖాదర్తో హీనా బేగంకు పరిచయం ఏర్పడింది. సాన్నిహిత్యం వివాహేతర బంధానికి దారి తీసింది. పిల్లల్ని తీసుకొని ఇద్దరూ ముంబయి, చెన్నై, జైపూర్,మనాలి వెళ్లారు. అక్కడ పిల్లలతో బిక్షాటన చేయించారు. చిన్నారి మెహక్ బిక్షాటన చెయ్యడం ఇష్టం లేక నిరాకరించింది. నాన్న దగ్గరికి వెళ్తానని గొడవ చేయగా.. ఖాదర్ ,హీనీ చిన్నారిని తీవ్రంగా కొట్టి హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఇద్దరూ కలిసి చిన్నారి మృతదేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి ద్వారకాపురి కాలనీలో ఒక షాప్ వద్ద వదలి వెళ్లారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో కేసు ఛేదించడం పోలీసులకు సవాల్గా మారింది. లకడీకాపూల్ వద్ద ఉన్న కెమెరాల ఆధారంగా కేసును కొలిక్కి తెచ్చి, నిందితులిద్దర్నీ అరెస్టు చేశామని పంజాగుట్ట సంయుక్త సీపీ ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. నిందితులకు బాలికను చంపాలన్న ఉద్దేశం లేదని, మాట వినకపోవడం వల్ల పదేపదే హింసించారని జాయింట్ సీపీ శ్రీనివాస్ తెలిపారు. తల్లి వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించడం, తండ్రి దగ్గరకు తీసుకెళ్లాలని అడగటం వల్లే కొట్టారని చెప్పారు. ఈ క్రమంలోనే పాప ప్రాణాలు కోల్పోయిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత