‘తల్లి గర్భం, సమాధి మాత్రమే సురక్షిత ప్రాంతాలు’.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్‌ నోట్‌

మానసిక వేధింపులకు గురైన ఓ బాలిక.. తన బాధను ఎవరికీ చెప్పుకోలేక నరకయాతన అనుభవించి చివరకు తనువు చాలించింది. ఆమె రాసిన సూసైడ్‌ నోట్‌ కంటతడి పెట్టిస్తోంది.....

Updated : 20 Dec 2021 07:17 IST

చెన్నై: పసిపిల్లలను నుంచి పండు ముసలివారి వరకు ఏ మహిళకు కూడా సమాజంలో రక్షణ లేకుండా పోయింది. అనువైన ప్రాంతంలో కంటికి ఎవరు చిక్కినా.. కామాంధులు వారిపై పంజా విసురుతున్నారు. దేశంలో అనేక చోట్ల ప్రతిరోజు అత్యాచార ఘటనలు, వేధింపులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అలాంటి మానసిక వేధింపులకు గురైన ఓ బాలిక.. తన బాధను ఎవరికీ చెప్పుకోలేక నరకయాతన అనుభవించి చివరకు తనువు చాలించింది. ఆమె రాసిన సూసైడ్‌ నోట్‌ కంటతడి పెట్టిస్తోంది.

చెన్నైలోని పూనమల్లే ప్రాంతానికి చెందిన 11వ తరగతి విద్యార్థిని కొద్దిరోజుల క్రితం అదృశ్యమవగా.. తాజాగా పోలీసులు ఆమె మృతదేహాన్ని గుర్తించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆమె ఇంట్లో ఓ సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆ లేఖలో ‘తల్లి గర్భం, సమాధి మాత్రమే మహిళకు సురక్షితమైన ప్రదేశాలు’ అని రాసుకొచ్చింది. తన కుమార్తె 9వ తరగతి వరకు ఓ ప్రైవేటు పాఠశాలలో చదివిందని, ఆ స్కూల్‌లో పనిచేసే ఓ ఉపాధ్యాయుడి కుమారుడు తన కుమార్తెను వేధించేవాడని తల్లి పోలీసులకు తెలిపింది. ఆ వేధింపుల కారణంగానే ఇప్పుడు మరో పాఠశాలలో చేర్పించినట్లు వివరించింది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు ఈ కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని