Crime News: శిల్పాచౌదరిని ప్రశ్నిస్తున్న నార్సింగ్ పోలీసులు... వివరాలు రాబట్టేందుకు యత్నం
పెట్టుబడుల పేరుతో మోసానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరిని నార్సింగి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. చంచల్గూడ మహిళా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న
హైదరాబాద్: పెట్టుబడుల పేరుతో మోసానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరిని నార్సింగి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. చంచల్గూడ మహిళా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న శిల్పా చౌదరిని 3 రోజుల కస్టడీలోకి తీసుకున్న పోలీసులు గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం నార్సింగ్ ఎస్ఓటీ కార్యాలయానికి తీసుకెళ్లారు. శిల్పా చౌదరిపై నార్సింగ్ పీఎస్లో 3 కేసులు నమోదయ్యాయి. రూ.7కోట్లు మోసం చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మరి కొంత మంది నుంచి డబ్బులు తీసుకొని ఎగ్గొట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. శిల్పా ఇంట్లో నుంచి పోలీసులు ఇప్పటికే పలు పత్రాలు, బ్యాంకు ఖాతాలు స్వాధీనం చేసుకున్నారు. శిల్పా చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు పలువురికి నోటీసులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఆమె వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. 3 రోజుల పాటు ప్రశ్నించి .. ఆమె వద్ద నుంచి పలు వివరాలు సేకరించేందుకు నార్సింగ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా